ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఆపాలో తమకు తెలుసు అని తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఎత్తుకు పై ఎత్తు వేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ బిజెపి లకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఉందని, అసలు పోతిరెడ్డి పాడు మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. 

 

పోతిరెడ్డి పాడు గురించి కాంగ్రెస్ బిజెపి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్  ఎందుకు మాట్లాడటం లేదని, దానిని ఏ విధంగా ఆపాలో విపక్షాలు ప్లాన్ చెయ్యాలని ఆయన సూచించారు. అప్పుడు ఉత్తమా కుమార్ రెడ్డి మంత్రి గా ఉన్నారని ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: