శ్రీశైలం విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి నిలదీశారు. గంటల కొద్దీ ప్రసంగాలు ఇచ్చే చంద్రబాబు దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసలు ఆయన వైఖరి ఏంటో చెప్పాలని చెప్పాలని, పరిజ్ఞానం లేకపోయినా గంటల కొద్ది మాట్లాడే చంద్రబాబు శ్రీ శైలం ఎత్తి పోతల పథకం పై మాట్లాడాలి అని డిమాండ్ చేసారు. 

 

చంద్రబాబు చెయ్యాల్సిన పని తాము చేస్తుంటే కడుపు మంటగా ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. కాగా పోతిరెడ్డి పాడు విషయంలో ఇద్దరు సిఎం లు డ్రామాలు ఆడుతున్నారని కాబట్టి అనవసరంగా ఎవరు మాట్లాడవద్దు అని చంద్రబాబు పార్టీ నేతలకు పలు సూచనలు చేసారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: