టిఎస్ బీపాస్ పై తెలంగాణా ఐటి శాఖా మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రం అంతా టిఎస్ బీపాస్ ని తీసుకుని రావాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. జూన్ మొదటి వారంలో అన్ని పురపాలికాల్లో టిఎస్ బీపాస్ ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. 

 

రానున్న 15 రోజుల్లో ప్రణాలికలు సిద్దం చెయ్యాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇందులో భాగస్వాములు అయిన వారు అందరికి శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచనలు చేసారు. ఈ సమావేశంలో అధికారుల అభిప్రాయాలను కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే తనను సంప్రదించాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: