ఆగస్ట్ నుంచి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ ని అమలు చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతా రామన్ స్పష్టం చేసారు. 8 కోట్ల మంది వలస కూలీలకు రేషన్ అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. రేషన్ కార్డు తో దేశంలో ఎక్కడి నుంచి అయినా రేషన్ తీసుకునే సదుపాయం కల్పిస్తామని నిర్మల పేర్కొన్నారు. 

 

ఇప్పటికే 83 శాతం రేషన్ కార్డుల పోర్టబిలిటి పూర్తి అయిందని ఆమె ప్రకటించారు. వచ్చే రెండు నెలలు వలస కార్మికులు ఎక్కడ అయినా రేషన్ తీసుకుంటారు అని నిర్మల వెల్లడించారు. వారికి రేషన్ అందించే ఏర్పాట్లు చెయ్యాలని నిర్మల పేర్కొన్నారు. దేశంలో ఎక్కడి నుంచి అయినా  రేషన్ తీసుకోవచ్చు అని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: