కేజిఎఫ్... ఈ సినిమా వచ్చిన తర్వాత దీని గురించి చాలా మందికి ఒక ఆసక్తి వచ్చింది అక్కడి బంగారు గనుల మీద. ఇప్పుడు అక్కడ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేజిఎఫ్ గనుల్లో ముడి బంగారం ఉందని ప్రచారం జరగడం తో ముగ్గురు బంగారం కోసం వెళ్ళారు. 

 

అక్కడ లోతు కి వెళ్ళడం తో గాలి ఆడక చనిపోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు ముగ్గురు కూడా అక్కడ బంగారం ఉందని గతంలో ప్రచారం చేసిన వాళ్ళే. కేజీఎఫ్‌కు చెందిన స్కంద (55), జోసెఫ్ (45) పాటు మరో ముగ్గురు కలిసి BGML (భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్) కంపెనీకి చేరుకొని లోపలి దిగారు. కాని అక్కడ గాలి ఆడకపోవడంతో మరణించారు. వెళ్లిన 5 మందిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడి అధికారులకు సమాచారం ఇచ్చినా సరే ఫలితం లేకుండా పోయంది.

మరింత సమాచారం తెలుసుకోండి: