ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నాగులప్పాడు మండలం రాపర్లలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని ట్రాక్టర్ డీ కొనడం తో కరెంట్ తీగలు తెగి పడి ట్రాక్టర్ మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారు అనేది స్పష్టత లేదు. 

 

వీరు అందరూ నాగులప్పాడు మండలానికి చెందిన వారిగా పోలీసులు చెప్తున్నారు. 9 మంది మహిళలు కూడా ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ లో 30 మంది కూలీలు ఉన్నారని గుర్తించారు. డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. కరెంట్ షాక్ తోనే వీరు అందరూ మరణించారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: