తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కాగా నాలుగు రోజుల నుంచి 40కు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు 47 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1414కు చేరింది. ఈరోజు నమోదైన కేసులలో 40 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. 
 
రంగారెడ్డి జిల్లాలో ఐదు కరోనా కేసులు నిర్ధారణ కాగా ఇతర ప్రాంతాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు 13 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈరోజు 13 మందితో కలిపి రాష్ట్రంలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 952కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: