రైతు సంక్షేమం, అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. *వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్* పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే రైతన్నలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి.
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికంగా ఉండడం గమనార్హం.