ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఉన్న నేపధ్యంలో ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ని ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొనసాగించవద్దు అని భావిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కాకినాడ, రాజమండ్రి, విశాఖ, సహా కొన్ని నగరాల్లో కరోనా కేసుల ఆధారంగా లాక్ డౌన్ ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నారు. 

 

ఇప్పుడు లాక్ డౌన్ ని ఎత్తకపోతే మాత్రం ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ భావిస్తున్నారు. అందుకే లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్రం లాక్ డౌన్ ని కొనసాగించినా సరే గ్రీన్ జోన్ లో పూర్తిగా సడలింపులు ఇవ్వాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: