దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఉన్నా సరే పెద్దగా ఫలితం లేదు. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,967 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వంద మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2649 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

దేశంలో ఇప్పటి వరకు 81,970 మందికి కరోనా సోకింది. కోలుకునే వారి శాతం 34. 6 గా ఉంది. మహారాష్ట్రలో కరోనా మరణాలు వెయ్యి దాటాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,524 మందికి కరోనా సోకింది. గుజరాత్ లో కూడా కరోనా కేసులు 10 వేల దిశగా వెళ్తున్నాయి. దేశంలో 51 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: