తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారని సమాచారం. గ‌త అర్ధ‌రాత్రి దాటాక ఆమెకు ఛాతీలో నొప్పి రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆమెను హుటాహుటీన హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించార‌ని స‌మాచారం. ఆమెను బంజారాహిల్స్ లోని కేర్ ఆసుప‌త్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఆమె ఆరోగ్య ప‌రిస్తితి నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఛాతీ నొప్పితో మంత్రి సబిత హాస్పిటల్‌‌లో చేరిందనే సమాచారం తెలియడంతో.. రాజకీయ నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలియ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: