ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల పుకార్లు దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఇలాంటి వైరల్ న్యూస్ లు మహా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.  ఈ మద్య తెలంగాణ మంత్రులపై వస్తున్న రూమర్లతో అభిమానులు టెన్షన్ కి గురి అవుతున్నారు.  ఈ మద్య తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ మీటింగ్ లో తుమ్మారు.. అంతే ఒక్కసారే కేటీఆర్ ఆరోగ్య సమస్యలు.. ఏం జరుగుతుంది.. ఏమైంది? ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. దాంతో ఆయన నాకేం కాలేదని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని... ఎలర్జీ వల్ల తుమ్మువచ్చిందని క్లారిటీ ఇచ్చారు.  ఇప్పుుడు ఇదే సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వచ్చింది.  తెలంగాణ విద్యాశాఖ మంత్రి అస్వస్థతకు గురయ్యారు.

 

గురువారం అర్ధరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఆమె అనారోగ్య విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ లేఖ విడుదల చేశారు.  రాత్రి అస్వస్థతకు గురైన విషయం నిజమేనని, కానీ ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్యులు మరికొద్ది సేపట్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు.  అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. దేవుని కృపతో మంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారంటూ విద్యాశాఖ లేఖలో పేర్కొంది.  రూమర్లు నమ్మవొద్దని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: