ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రైతుల గురించి వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని చెప్పారు. దాదాపు అన్ని జిల్లాల రైతులతో జగన్ మాట్లాడి వారి కష్ట నష్టాలను ఆర్ధిక పరిస్థితులను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసారు. 

 

ఇక శ్రీకాకుళం జిల్లా రైతులతో కూడా జగన్ మాట్లాడారు . ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మరో చోట మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కూడా పాల్గొన్నారు. వారి ఇద్దరినీ చూసిన జగన్  సీతారాం అన్నా  కృష్ణ దాస్ అన్నా బాగున్నారా అంటూ అడిగారు. వారిద్దరిని ఇలా అడగడం తో వారు పొంగిపోయారు. వారితో ఒక నిమిషం పాటు జగన్ ముచ్చటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: