రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ రైతులతో మాట్లాడారు. అన్ని జిల్లాల రైతులతో ఆయన ముచ్చటించారు. వారి కుటుంబ వివరాలను వారికి సంబంధించిన ఆర్ధిక కష్టాలను అన్నీ కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇంకేం కావాలి అనేది కూడా జగన్ స్వయంగా అడిగారు. ఏ కష్టం వచ్చినా తనకు చెప్పుకోవాలని ధైర్యం చెప్పారు. 

 

ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి మండలానికి చెందిన ఒక రైతు భావోద్వేగంగా ప్రసంగించారు. జగన్ తనతో స్వయంగా మాట్లాడటం తో రైతు అన్ని విషయాలను పంచుకున్నారు. రైతు మాట్లాడిన మాటలు చేసిన ప్రసంగం జగన్ ని విశేషంగా ఆకట్టుకుంది. కాగా టెక్కలి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే గా ఉన్నారు అచ్చెన్నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: