రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు మంత్రులను నాయకులను పలకరించిన తీరు ఆశ్చర్యంగా మారింది. సిఎం అయినా సరే తనకు అండగా నిలబడిన వారిని ఆప్యాయంగా పలకరించారు. ఎవరిని మరిచిపోకుండా అన్నా అంటూ పలకరించి వారిని ఉద్దేశించి కుశల ప్రశ్నలు వేసారు జగన్. అన్నా అంటూ ఆయన పలకరించిన విధానమే హైలెట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు.
విశాఖ జిల్లా కార్ఫరెన్స్లో ముందుగా ఏజెన్సీ పాడేరు రైతుతో మాట్లాడించారు. రైతు కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ అన్న.. మాడుగుల ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నా.. వైజాగ్ అర్బన్ డవలప్మెంట్ అథార్టీ చైర్మన్ శ్రీనివాస్ అన్నా అంటూ పలకరించిన అన౦తరం పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి ఆదీరాజ్ను ఉద్దేశించి బాగున్నావా అది అన్నారు.. ఆదీపై ఎప్పుడు స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు జగన్. పాదయాత్ర చేసిన సమయంలో కూడా జిల్లాలో తన వెంటే ఉంచుకున్నారు.