మూడవ రోజు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజి వివరాలను వెల్లడించారు. వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆమె ప్యాకేజి ప్రకటిస్తున్నట్టు వివరించారు. మత్స్య డైరీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు ప్యాకేజిని ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు వీధి వ్యాపారులు, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఆమె ప్యాకేజి ప్రకటించారు. 

 

నిన్న వలస కార్మికుల సంక్షేమ౦ కోసం నిర్మలా సీతారామన్ ప్యాకేజి వివరాలను ప్రకటించారు. నేడు చిన్న సన్నకారు రైతులకు ఆమె తన కేటాయింపులు ప్రకటించారు. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. ధాన్యం గోదాముల్లో స్వయం వృద్ది సాధించామని నిర్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: