ఈ సంవత్సరం 2020 అస్సలు బాగాలేదని అంటున్నారు.. సినీ ఇండస్ట్రీ పెద్దలు.  ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్, సినిమాలు వాయిదా పడ్డాయి.  దాంతో ఎంతో మంది సినీ కార్మికులు కష్టాల పాలయ్యారు. ఆ మద్య భారతీయుడు 2 మూవీ షూటింగ్ సందర్భంగా ముగ్గురు చనిపోయారు.  ఈ మద్య బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, షషి కపూర్ మరో నిర్మాత కన్నుమూశారు.  ఇలా పలు ఇండస్ట్రీ ప్రముఖులు చనిపోయారు.  తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ను మరోసారి విషాదం వెంటాడింది. ఆయనకు అత్యంత ఇష్టమైన శిష్యుడు, తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఏవీ అరుణ్ ప్రసాద్ అలియాస్ వెంకట్ పక్కర్ ఆకస్మిక మరణంతో ఆయన తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

 

శుక్రవారం ఉదయం కోయంబత్తూర్‌కు సమీపంలో ని మెట్టుపాలయమ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణ్ ప్రసాద్ దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనను హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యంలో మరణించినట్టు తెలిసింది. అరుణ్ ప్రసాద్ మరణంతో జీవీ ప్రకాశ్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. నాకు అత్యంత ఇష్టమై వ్యక్తి వెంకట్ పక్కర్ ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: