తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ సమయంలో కరోనా కారణంగా పోస్ట్ పోన్ చేసుకున్నారు.  ముంబాయిలోని ధారావి ప్రాంతంలోఎక్కువగా షూటింగ్ ఉండటంతో అక్కడ చేయాలా లేదా సెట్టింగ్స్ వేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు పూరి.  ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న ఆయన కరోనా పై వీడియోలు.. తన జ్ఞాపకాలకు సంబంధిచినవి సోషల్ మాద్యమంలోపోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

తాజాగా ఆయన ఓ అపూరూపమైన వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 1954 నాటి వీడియో అది. బాలీవుడ్ తారలు జార్జియాకు వెళ్లిన సమయంలో తీసినది. ఈ వీడియోలో రాజ్ కపూర్, దేవానంద్, నర్గీస్, బిమల్ రాయ్, బల్రాజ్ సహానీ తదితరులు ఉన్నారు. ఈ వీడియోలో ఆ నటులు మాట్లాడుతున్నది.. భారతీయ సినీ గొప్పతనం చూసినట్లు ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: