సిఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలోని వారధి వద్ద రోడ్డుపై వలస కూలీలు కనపడగా వారితో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని మాట్లాడారు. నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలతో ఆమె స్వయంగా మాట్లాడారు. వారి కష్టాలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. సిఎం తో సమావేశం ముగించుకుని వెళ్తున్న సమయంలో కనిపించిన కూలీలతో ఆమె మాట్లాడారు. 

 

కూలీలకు వెంటనే వసతి భోజన సౌకర్యాలను కల్పించాలని ఆమె ఆదేశాలు ఇచ్చారు. కృష్ణా కలెక్టర్ గుంటూరు జేసీలకు ఫోన్ లో ఆదేశాలు ఇచ్చారు నీలం సహాని. త్వరలో బీహార్ వెళ్ళే రైళ్ళలో వలస కూలీలను పంపాలని సియేస్ ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఆమె ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: