ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రెచ్చిపోతోంది. రోజుకు వందలు, వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరిస్తోంది. అమెరికా మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 1,680 మంది మరణించారని, దేశంలో మరణించిన వారి సంఖ్య 87,493 కు పెరిగిందని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. యూఎస్లో కొవిడ్ -19 కేసులు మొత్తం 1,442,924 నమోదయ్యాయని పేర్కొంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 305,424 మరణాలు సంభవించాయి. సుమారు 4,503,811 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఐరోపాలో 1,848,790 కేసులు నమోదుకాగా, 164,145 మరణాలు సంభవించాయి. ఇక భారత్లో శుక్రవారం సాయంత్రం వరకు కరోనావైరస్ కేసులు 81,970కు పెరిగాయి. వైరస్ కారణంగా 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 27,919 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.