లాక్ డౌన్ సడలింపు లు ఇవ్వడం ఏమో గాని ఇప్పుడు జనాలు రోడ్ల మీదకు అడుగు పెడుతున్నారు. కొందరు సడలింపు లు లేకపోయినా సరే రోడ్ల మీద కు రావడం ప్రమాదాలకు గురి కావడం వంటివి జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మళ్ళీ వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన బయట పడుతుంది. 

 

ఇక తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ ని కారు డీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అందరూ కేరళ కి చెందిన వారిగా గుర్తించారు అధికారులు. బీహార్ నుంచి కేరళ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: