అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకు రావడం ఏమో గాని ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత ఓటర్లను తన వైపుకి తిప్పుకోవడానికి గానూ ఇప్పుడు కరోనా రూపంలో భారత్ కి సహాయ౦ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా విషయంలో ఆర్ధికంగా అమెరికా సహాయం చేసిన సంగతి తెలిసిందే. 

 

తాజాగా భారత్ కి వెంటిలేటర్లు ఇస్తున్నట్టు ఆయన ట్వీట్ చేసారు. “భారతదేశంలోని మా స్నేహితులకు వెంటిలేటర్లను అమెరికా విరాళంగా ఇస్తుందని ప్రకటించడం గర్వంగా ఉంది. ఈ మహమ్మారి సమయంలో మేము భారతదేశంకి అండగా నిలబడతాం. టీకా అభివృద్ధికి కూడా మేము సహకరిస్తున్నాము. కలిసి మనం అదృశ్య శత్రువును ఓడిస్తామని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: