తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. రాజమండ్రి లో వివాదాస్పద భూములను పరిశీలించడానికి గానూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చినరాజప్ప వెళ్ళారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. 

 

బూరుగుపూడి లో ఉన్న ఆవ భూములను పరిశీలించడానికి గానూ ఎమ్మెల్యేలు వెళ్ళారు.  నిమ్మల రామానాయుడు ని పోలీసులు అడ్డుకున్నారు. లాక్ డౌన్ అమలులో ఉందని 144 సెక్షన్ అమలు చేస్తున్నామని వారిని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు అడ్డుకున్నా సరే ఆగలేదు. దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: