కరోనా తో పోరాడుతున్న భారత్ కి అమెరికా వెంటిలేటర్లను విరాళం గా ఇవ్వడం పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు మోడీ ట్రంప్ కి ధన్యవాదాలు చెప్పారు. ఈ సమయంలో మీ సాయం చాలా గొప్పది అంటూ మోడీ ట్రంప్ ని ఉద్దేశించి కొనియాడారు. 

 

అధ్యక్షుడు ట్రంప్ కు ధన్యవాదాలు. ఈ మహమ్మారి మనందరితో సమిష్టిగా పోరాడుతోంది. అటువంటి సమయాల్లో, దేశాలు కలిసి పనిచేయడం మరియు మన ప్రపంచాన్ని ఆరోగ్యంగా మరియు కరోనా నుండి విముక్తి కలిగించడానికి వీలైనంత వరకు చేయడం ఎల్లప్పుడూ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ స్నేహానికి మరింత శక్తి అందింది అంటూ మోడీ పేర్కొన్నారు. కాగా ట్రంప్ వెంటిలేటర్లు ఇస్తున్నట్టు రాత్రి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: