హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయినా సరే లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఇక అప్పటి నుంచి కూడా ఓటీటీ ఫ్లాట్ ఫాం లో దీనిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 

 

ఇప్పుడు అనుకున్న విధంగా వస్తున్న వార్తలను ఖరారు చేస్తూ ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తారు. భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: