మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ఏపీ సిఎం వైఎస్ జగన్ తెలివైన వ్యక్తి అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి. ఆయన పోతిరెడ్డి పాడు జలాల విషయంలో మీడియా తో మాట్లాడుతూ తెలంగాణా సిఎం కేసీఆర్ పై అలాగే సిఎం జగన్ పై కూడా విమర్శలు చేసారు. ఇద్దరూ కుమ్మక్కయారు అని ఆయన మండిపడ్డారు. 

 

కమీషన్ల కోసమే ఇన్నాళ్లు కేసీఆర్ మౌనంగా ఉన్నారని, పోతిరెడ్డిపాడు విస్తరణపై డిసెంబర్‌లో జగన్‌ ప్రకటన చేస్తే కేసీఆర్‌ స్పందించలేదని ఆయన ఆరోపించారు. గోదావరి, కృష్ణా అనుసంధానం పేరుతో వేల కోట్ల కమీషన్ల కోసం కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆరోపణలు చేసారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకే కేసీఆర్‌ సీఎంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: