నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని అంటించుకున్న ఘటన హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది ఎందుకు జరిగింది అనేది ముందు నుంచి స్పష్టత రాలేదు. పోలీసులు కూడా దీనిపై ముందు ఏ అంచనాకు రాలేదు. తాజాగా దీనిపై విచారణ పూర్తి చేసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. 

 

తనతో భార్య గొడవపడి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రావడం లేదని మనస్తాపంతో భువనసూర్య అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిన్న మద్యాహ్నం జీడిమెట్లలో ఈ ఘటన చోటు చేసుకాగా అక్కడే ఉన్న స్థానికులు వేగంగా స్పందించి అతనిని ఆస్పత్రికి తరలించారు. అయినా సరే అప్పటికే తీవ్ర గాయాలు కావడం దాదాపుగా 90 శాతం అతను కాలిపోవడంతో చికిత్స పొందుతూ మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: