కరోనాపై మనం చేసే పోరాటంలో వైద్యుల పాత్ర గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. వైద్యులు కరోనా పోరాటం లో చాలా ముందు ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిని కూడా కొందరు ఇబ్బంది పెడుతున్నారు వారి మీద దాడులకు కూడా దిగుతున్నారు. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఢిల్లీ లో ఒక ఘటన జరిగింది. ఒక వైధ్యురాలికి కరోనా రాగా ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి ఇంటికి వచ్చారు. కాని మనీష్ అనే వ్యక్తి ఆమెను ఇంట్లో బంధించి ఇంటి  నుంచి బయటకు వస్తే చంపేస్తా అని హెచ్చరించారు. డాక్టర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి అతనిపై కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: