ఈ మద్య మనుషుల్లో ఏ మాత్రం అసహనం వచ్చినా తమను తాము కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు.  ఒకరకంగా ఉన్మాదులుగా మారిపోతున్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని లాక్ డౌన్ పాటిస్తున్న కొంత మంది ప్రజలు ప్రెస్టేషన్ కి గురిఅవుతు తమ ఇంటివారిపై గొడవలకు దిగడం.. తమను తాము హింసించుకోవడం జరుగుతుంది. తాజాగా ఓ సీఆర్పీఎఫ్ జవాను దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో చోటుచేసుకుంది. శనివారం అలహాబాద్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) గ్రూప్ సెంటర్లో ఈ ఘటన జరిగిందని అధికారులు మీడియాకు తెలిపారు. 

 

సీఆర్పీఎఫ్ 224 వ బెటాలియన్లో డ్రైవర్ గా పనిచేస్తున్న వీకే యాదవ్.. తన భార్య, కూతురు, కొడుకును..సర్వీస్ పిస్టల్ తో కాల్చి చంపాడని వారు తెలిపారు. హత్య ఎందుకు చేశాడు.. దాని వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే స్పాట్​ను పరిశీలించిన ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: