దేశ వ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. వాళ్ళు పడుతున్న కష్టం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎపీకి చెందిన వలస కూలీల విషయంలో సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. అది ఏంటీ అంటే... 

 

వలస కూలీల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు సిఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ బస్సులను ఉత్తరాది రాష్ట్రాలకు పంపించే ఆలోచనలో జగన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. శ్రామిక్ రైళ్ళలో కార్మికులు రాలేక అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: