పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. హాయిగా జీవితాలు గడుపుతున్నారు. కానీ కామం కళ్లుమూసుకుపోయి.. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు.  పిల్లి కళ్లు మూసుకుని తాగితే ఎవరు చూడరు అనుకున్నట్టు.. వీరు కూడా ఆ మాదిరే తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కానీ, అలాంటివి ఎక్కువ రోజులు దాగలేదు.  ఇప్పుడు ప్రతి చిన్న విషయం ఫోటోలు, వాట్సాప్ లో వైరల్ అవుతున్నాయి. అలాగే తమ వివాహేతన సంబంధం బయట పడుతుందనన్న భయం ఆ జంటకు మానసిక వేదన అయ్యింది.  అంతే ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదన్నట్టు ఆత్మహత్య చేసుకున్నారు.  కానీ ఆ జంట చనిపోవడం వల్ల ఓ కుటుంబంలో పిల్లలకు తల్లి దూరమైంది.. మరో కుటుంబంలో తండ్రి దూరమయ్యాడు. 

 

వివరాల్లోకి వెళితే.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)ల మధ్య  గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. బాలనర్సుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ప్రేమలతకు భర్త, కుమారుడు ఉన్నారు.  అయితే తమ అక్రమ సంబంధం ఇంటి వాళ్లకు తెలిస్తే గ్రామంలో పరువు పోతుందని భయపడ్డారు. ఇద్దరూ గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: