IHG

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి తన కొడుకు ఇజాన్ తో కలసి హైదరాబాద్ లో ఉంటుంది. మరోవైపు అదే సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)‌లో ఆడుతున్న షోయబ్ మాలిక్.. పాక్‌‌లో ఉండిపోయాడు. దీనితో తన కొడుకు ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు కలుస్తాడో అని సానియా మీర్జా తన విచారాన్ని తన పేస్ బుక్ ఖాతా ద్వారా తెలియజేసింది.

 

అయితే సానియా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ...షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న కారణంగా పాకిస్తాన్లోనే ఉండిపోయాడు. అయితే 65 సంవత్సరాల తల్లి అతనితోనే ఉంటుంది కాబట్టి తనను షోయబ్ దగ్గరుండి చూసుకోవాలి. లాక్ డౌన్ కారణంగా తన కుమారుడు ఇజాన్ తన తండ్రిని చూడలేక పోతున్నాడు అంటూ తన భాదను పేస్ బుక్ ద్వారా వ్యక్తం చేసింది. షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్తాన్  t20 జట్టులో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని యోచిస్తున్నాడు అని సానియా తెలిపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: