వలస కూలీలు, కార్మికులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 150 మందికి పైగా వలస కూలీలు దుర్మరణం చెందారు. నిన్న ఉదయం ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న వాహనం-ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వలస కూలీలు చెన్నై నుంచి బిహార్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.