లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్ళడానికి గానూ నానా కష్టాలు పడుతున్నారు. దక్షినాది రాష్ట్రాల నుంచి భారీగా వలస కార్మికులు జాతీయ రహదారుల వెంట నడిచి వెళ్తున్నారు. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీ ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా గుమిగూడారు వలస కార్మికులు. 

 

దీనితో ఇప్పుడు ఆ ప్రాంతంలో భారీగా వలస కార్మికులు మొహరించారు. ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు ఇలా గుమి గూడారు. అవురియా రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు చనిపోవడంతో వారి కోసం బస్సులను ఏర్పాటు చెయ్యాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య ఆదేశించడం తో ఇప్పుడు వలస కార్మికులు గుమి గూడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: