ఒక పక్క హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నా సరే జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా లాక్ డౌన్ ని మాత్రం పట్టించుకోవడం లేదు. వెజ్ నాన్ వెజ్ కోసం వందల మంది బారులు తీరారు. కరోనా ఉన్నా సరే ఆదివారం సాంప్రదాయాన్ని మాత్రం వదలడం లేదు.

 

దీనిపై ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. హైదరాబాద్ లో నమోదు అవుతున్న కేసులు అన్నీ కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. కొన్ని వాటికి లక్షణాలు లేవు అని చెప్తున్నారు. అయినా సరే జనాలు మాత్రం వినడం లేదు. హైదరాబాద్ లో ఈ పరిస్థితిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: