వలస కూలీల స్వస్థలాలకు పంపే బాధ్యత రాష్ట్రాలదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేసారు. వలస కార్మికులు పడుతున్న కష్టాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర కు వెళ్ళిన కూలీ మృతి బాధాకరం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 

రాష్ట్రాల సమన్వయ౦తోనే వలస కార్మికుల కష్టాలు తీర తాయని అన్నారు. వలస కార్మికులను గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా వలస కార్మికులు ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వందల మంది నడిచి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిపై ఏపీలో లాఠీ చార్జ్ కూడా జరిగింది. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: