హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో శాలిని పాండే సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమాను గత నెలలోనే విడుదల చెయ్యాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది. 

 

ఇక ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తారని పలువురు కామెంట్ లు చేస్తున్నారు. అయితే అది నిజ౦ కాదని థియేటర్ లోనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయితే ఎప్పుడు విడుదల చేసేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు చిత్ర యూనిట్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: