కరోనా కష్టాల నేపధ్యంలో కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి వలన ఎలాంటి ఉపయోగం లేదని ఇప్పుడు పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు దీనిపై అనేక సెటైర్లు వినపడుతున్నాయి. అసలు ఎం చెప్పారో అర్ధం కాలేదని ఏదో మాత్రం చెప్పారని, దీని వలన ఎవరు లాభ పడ్డారో అర్ధం కాకపోయినా ప్రపంచం మొత్తం ఆసక్తి చూపించారు అని ఎద్దేవా చేస్తున్నారు. 

 

అప్పులు ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టాలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా చాలా మందిలో అసలు నిర్మల ప్రకటించిన ప్యాకేజి కి సంబంధించి ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏ లెక్కలు చెప్పారో అర్ధం కాలేదని 5 రోజుల్లో 20 లక్షల కోట్లను భర్తీ చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: