దేశాన్ని కాపాడాల్సిన భారత సైనికులు ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజు పదుల సంఖ్యలో భారత్ లో సైనికులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో పహారా కాసే వారు ఎక్కువగా కరోనా పాజిటివ్ గా తేలుతున్నారు. 

 

గత 24 గంటల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సిబ్బందిలో 10 కేసులు నమోదయ్యాయి. వీరంతా కరోనా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న 13 మందిని డిశ్చార్జ్ చేసారు. వీరు అందరూ కూడా ఢిల్లీ లోనే ఉన్నారని వారిలో కరోనా ఎక్కువగా వస్తుంది అని అధికారులు చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: