తెలంగాణా సిఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ప్రగతి భవన్ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనంగా మారింది. చెప్పుల షాపు పెట్టిన ఒక వ్యక్తి తాను తీవ్రంగా నష్టపోయా అని అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పాడు. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు వివరించారు. 

 

తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే తన కుటుంబం నరకం చూస్తుంది అని చెప్పాడు. తన కుటుంబాన్ని కేసీఆర్ ఆదుకోవాలని అతను కోరాడు. వెంటనే అప్రమత్తమైన ప్రగతిభవన్ రక్షణ సిబ్బంది నజీరుద్దీన్‌ను అడ్డుకున్నారు. అనంతరం నజీరుద్దీన్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించడం తో అక్కడ అంతా కూల్ అయింది. ఆ వ్యక్తిది చంచల్ గూడ అని గుర్తించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: