బీహార్ లో వలస కార్మికులు అక్కడి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్ళకు నడిచి వెళ్తున్న కార్మికుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ వచ్చిన 10,385 వలస కార్మికుల్లో 560కి కరోనా పాజిటివ్ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

 

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. అక్కడికి వెళ్తున్న వలస కార్మికులు అందరిని క్వారంటైన్ కి పంపారు. వలస కార్మికుల్లో 560 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 172 మంది ఢిల్లీ నుంచి, 123 మంది మహారాష్ట్ర నుంచి, 26 మంది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు అని అధికారులు పేర్కొన్నారు. ఇక వీరితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని ఇప్పుడు క్వారంటైన్ లో ఉంచారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: