దేశంలో కరోనా సేవల్లో అత్యుత్తమ స్థితిలో ఉన్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. గాంధీ ఆస్పత్రిలో నాలుగవ తరగతి ఉద్యోగులు మద్యం సేవించారు. మొన్న రాత్రి 2 గంటల వరకు వారు మద్యం సేవించారు. మద్యం సేవించి ఇంటికి వెళ్ళిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

 

శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇంటికి వెళ్ళగానే గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఈ ఘటనపై ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. మద్యం సేవించిన వాళ్ళ వివరాలను ఆస్పత్రి వర్గాలు సేకరించాయి. వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసి విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం కూడా ఆరా తీసింది వాళ్ళను.

మరింత సమాచారం తెలుసుకోండి: