ఎమ్మెల్సీ గా ఎన్నికైన మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తో పాటుగా శాసన మండలి లో సభ్యులుగా ఎన్నికైనా మరో 9 మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాల కోసం 9 మంది సభ్యులే నామినేషన్ వేసారు. 

 

దీనితో వారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉద్దావ్ తో పాటుగా శివసేన పార్టీనేత నీలం గోర్హీ, బీజేపీ నేతలు గోపిచంద్ పడల్ కర్, ప్రవీణ్ దాట్కే, రంజిత్ సిన్హా మొహిత్  పాటిల్, రమేష్ కరద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు . ఎమ్మెల్సీ గా ఉద్దావ్ ఎన్నిక కాకపోతే మాత్రం ఆయన పదవికి గండం ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: