ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లా కృష్ణ జిల్లాలో కేసులు అత్యంత వేగంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఏపీలో కొత్త కేసులు 52 నమోదు కాగా అందులో 19 కేసులకు చెన్నై కోయంబేడు మార్కెట్ లింక్ లు ఉన్నాయని అధికారులు చెప్పారు. 

 

ఇటీవల కొందరు డ్రైవర్లు హమాలీలు కోయంబేడు వెళ్లి వచ్చారు. ఇక టమాటా వ్యాపారులు అందరూ కూడా భయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కోయంబేడు లింక్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్న సరే కోయంబేడు లింక్ లు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీ తమిళనాడు లో ఇంకా కోయంబేడు లింక్ లు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: