ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉన్నా సరే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఏదోక అంశాన్ని ఎత్తుకుని ఇప్పుడు ఒకరిపై ఒకరు ఏదోక రూపంలో విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారింది. అనవసర సమయంలో అనవసర విమర్శలను ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో చేసుకుంటున్నారు. 

 

తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని నానీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై విమర్శలు చేసారు. వ్యాపారస్తులను బెదిరించి మరీ దండుకుంటునావు దుర్గగుడి మొత్తం దోచేస్తునావు వినాయకుడి గుడి నాకేస్తునావు నీ దెబ్బకి విజయవాడ వణికిపొతుంది మంత్రి గారు అంటూ ఆయన ట్వీట్ చేసారు. సిఎం వైఎస్ జగన్ కి వైసీపీ అధికారిక ట్విట్టర్ కి ఆయన ట్యాగ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: