IHG

ఆడపిల్ల పుడితే సాక్ష్యాత్తు లక్ష్మి దేవి పుట్టిందనుకునే ఈ భారత దేశంలో ఆడపిల్ల పుట్టడమే నేరంగా భావించి అమానుషంగా పసికందును పొట్టన బెట్టుకుంటున్నారు కసాయి తల్లితండ్రులు. ఇలాంటి ఘటనే తమిళనాడులోని మధురైలోని సోలవందన్‌ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. సోలవందన్‌ లో స్థానికంగా ఉంటున్న దంపతులకు వారం క్రితం కుమార్తె పుట్టింది. ఆడబిడ్డ కావడంతో ..తండ్రికి , నానమ్మలు మనసు మనసులో లేకుండా పోయింది. ఆ పుట్టిన బిడ్డ వారికీ భారంగా కనిపించింది..అనిపించిందే తడవుగా ఆ బిడ్డను కడతేర్చాలని నిర్ణయించుకున్నారు.

IHG

 

తల్లి నిద్రిస్తుండగా ఆమెకు తెలియకుండా తండ్రి , నానమ్మ లు ఇద్దరు కలసి బ్రహ్మజెముడు పాలను బిడ్డచేత త్రాగించారు. ఆ పాలను తాగిన పసికందు విగత జీవిగా మారింది. పాప చనిపోవడంతో అనారోగ్యం కారణంగానే ఆ పసిబిడ్డ చనిపోయిందని తండ్రి అందరిని నమ్మబలికాడు. కానీ పసిబిడ్డ తల్లికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పసిబిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టాన్ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ కేసులో  తండ్రితో పాటు నానమ్మను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: