ఆంధ్రప్రదేశ్ లో కోయంబేడు కరోనా లింక్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు తమిళనాడు ఇటు ఏపీలో క్రమంగా కరోన కేసులు కోయంబేడు లింక్ ల కారణంగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఇస్రో లో కూడా కరోనా కలకలం రేగింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉన్న సూళ్లూరుపేటలో కోయంబేడు లింక్ లు ఎక్కువగా ఉన్నాయి. 

 

తమిళనాడు కి అత్యంత సమీప౦లో ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 కి చేరుకుంది. ఇప్పుడు ఈ సెగ ఇస్రో ని కూడా తాకింది. కోవిడ్ కేసులు నమోదు కానంత వరకూ తాము జనరల్ డ్యూటీలు చేయలేమని షార్ ఉద్యోగులు అధికారులకు స్పష్టం చేసారు. వారు రెండో గేటు వద్ద ధర్నా కు దిగారు. దీనితో ఉన్నతాధికారులు ఏమీ చేయలేక ఓకే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: