ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ గ్యాస్ లీక్ ఘటన తరువాత అధికారులు, ప్రజా ప్రతినిధులు బాగా స్పందించారని అన్నారు. విశాఖ కలెక్టర్, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, కృష్ణదాస్ బాధితుల దగ్గరకు వెళ్లి రాత్రి బస చేశారని అన్నారు. నా మంత్రివర్గంలో మంచి మంత్రులు ఉన్నారని సంతోషపడుతున్నానని చెప్పారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటూ బాధితులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని సూచించారు. 
 
ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులు అన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినవే అని చెప్పారు. భారీ జరిమానాలు వేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని... భవిష్యత్తులో కూడా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. బాధితుల కుటుంబాలకు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: