ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే విమానాలు మన దేశ ప్రజలను కంటి మీద కునుకు ఉంచడం లేదు. తాజాగా కువైట్ నుంచి వచ్చిన ఒక విమానంలో ఏకంగా 18 మందికి కరోనా ఉందని తెలిసింది. వచ్చిన 240 మంది భారతీయులలో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విమానం మధ్యప్రదేశ్ ఇండోర్ లో దిగింది. దీనితో విమానయాన సిబ్బంది కూడా ఇప్పుడు భయపడుతున్నారు. తాము విధులకు వచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

 

మే 13న‌ రాత్రి రెండు విమానాల ద్వారా 240 మంది రాగా వారు అందరిని భోపాల్ కు బస్సులో తరలించి క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. వారి నమూనాలను పరిక్షలు చేయగా వారిలో 18 మందికి ఉందని తెలిసింది. ఇక అక్కడి భద్రతా సిబ్బంది కూడా క్వారంటైన్ కి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: