ఒక పక్క కరోనా తీవ్రత చాలా అధికంగా ఉన్నా సరే జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కోయంబేడు లింక్ లు కలకలం రేపుతున్నాయి. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు బయటకు రావొద్దని అధికారులు చెప్తున్నారు. సడలింపు లు ఇచ్చినా సరే అవసరం కోసమే ఇచ్చామని అంటున్నారు. 

 

అయినా సరే జనాలకు మాత్రం రాజమండ్రి లో  ఏ మాత్రం కూడా భయ౦ లేదు అనేది అర్ధమవుతుంది. తాజాగా సడలింపు లు ఇవ్వడం తో రాజమండ్రి లో జనాలు ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చేశారు. వేలాది మంది రోడ్ల మీద బారులు తీరారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: